లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు మూత పడటంతో మందు బాబులు పిచ్చెక్కి పోతున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని హసన్ పట్టణంలో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి పెగ్గు దొరక్క పిచ్చెక్కి పోయాడు. ఈ క్రమంలో తాను రోజూ వెళ్లే ఓ వైన్ షాపు పై అంచులు తొలగించి లోపలికి ప్రవేశించాడు. అక్కడ మద్యం కనబడటంతో పట్టరాని సంతోషంతో మోతాదుకు మించి తాగాడు.
దీంతో స్పృహ తప్పిన మందుబాబు అక్కడే పడుకున్నాడట. ఉదయం వైన్ షాపు ముందు ఉన్న చెప్పులు కనిపించడంతో .. అనుమానం వచ్చిన సెక్యూరిటీ గార్డు లోపలికి చూడగా వ్యక్తి మద్యం సేవించి పడి పోయి ఉండటం గమనించాడు. వెంటనే సెక్యూరిటీ గార్డు ఫోలీసులకు ఫిర్యాదు చేయడంతో మందు బాబుని అరెస్ట్ చేశారు.