తంగళ్లపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆస్తి కోసం తండ్రిని కొట్టి చంపాడో కొడుకు. పోలీసుల వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి మండలం పద్మానగర్కు చెందిన దూస ఆంజనేయులు(65) భార్య లలిత. వీరికి నలుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. వీరిలో ముగ్గురు కూతుళ్లు, కొడుకులకు పెళ్లిళ్లు కాగా చిన్న కూతురుకు కావాల్సి ఉంది. ఆస్తి పంపకాల విషయంలో పెద్ద కొడుకు శ్రీనివాస్కు, తండ్రి ఆంజనేయులకు వివాదం తలెత్తింది. 3 భాగాలుగా పంచుతానని తండ్రి చెప్పగా అందుకు శ్రీనివాస్ఒప్పుకోలేదు. 2 భాగాలుగా పంచకపోతే చంపేస్తానంటూ తండ్రిని బెదిరించాడు. భయపడిపోయిన ఆంజనేయులు కుటుంబంతో సహా రెండేండ్లుగా వేములవాడలోని పెద్ద కూతురు వద్ద ఉంటున్నాడు. పద్మానగర్లోనే ఉంటున్న శ్రీనివాస్ఇటీవల ఇంటి గోడను తండ్రి భాగంలోకి జరిపి కట్టాడు. విషయం తెలుసుకున్న ఆంజనేయులు గురువారం పద్మానగర్వెళ్లాడు. తిరిగి వేములవాడ రాకపోవడంతో శుక్రవారం ఉదయం లలిత పద్మానగర్కు వెళ్లింది. అప్పటికే శ్రీనివాస్ ఇంట్లో ఆంజనేయులు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. కొంతకాలంగా ఆస్తి కోసం బెదిరిస్తున్న శ్రీనివాసే తండ్రిని చంపి ఉంటాడన్న తల్లి లలిత ఫిర్యాదు మేరకు ఎస్సై లక్ష్మారెడ్డి కేసు ఫైల్ చేశారు. శ్రీనివాస్ కుటుంబంతో సహా పరారీలో ఉన్నాడు.
ఆస్తి కోసం తండ్రిని కొట్టి చంపిండు
- క్రైమ్
- October 30, 2021
లేటెస్ట్
- సోషల్ మీడియా వేధింపులపై జగన్ కీలక నిర్ణయం..
- శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మరో ముగ్గురు అరెస్ట్
- రూ.4 వేల 500 కోసం స్నేహితుడిని చంపేశాడు
- ఏసీలో పాము.. క్లీన్ చేస్తుండగా బుసలు..
- చంద్రబాబు పాలనలో స్కాములు మాత్రమే ఉంటాయి.. సీఎం జగన్
- SRH vs RCB: ఉప్పల్లో ఆర్సీబీతో మ్యాచ్.. అర్దరాత్రి వరకు మెట్రో సేవలు
- Prathinidhi 2 Postponed: ప్రతినిధి 2 రిలీజ్ వాయిదా..సడెన్గా మేకర్స్ షాకింగ్ డెసిషన్
- భార్యను కాపురానికి పంపడం లేదని... అత్తను చంపిన అల్లుడు
- రేవంతుడు.. తెలంగాణ హనుమంతుడు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ట్వీట్
- కొండగట్టులో బస్సు కింద పడి అంజన్న భక్తుడు మృతి
Most Read News
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- సలేశ్వరం జాతర మొదలైంది..శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు