- రైల్లోంచి కిందపడ్డ వ్యక్తికి.. ట్రీట్మెంట్ ఇవ్వకుండా బెడ్కు కట్టేసిన్రు
- రోజంతా అలాగే వదిలేయడంతో మృతి
- పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం
పెద్దపల్లి, వెలుగు: రైలులో నుంచి కిందపడ్డ వ్యక్తి ట్రీట్మెంటుకు సహకరించట్లేదని బెడ్కు కట్టేసి వదిలేశారు. దాంతో బాధితుడు ప్రాణాలు విడిచాడు. సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో హజ్రత్నిజాముద్దీన్ నుంచి డోన్కు వెళ్తున్న ఉత్తరాఖండ్కు చెందిన అతుల్దాలీ(42).. పెద్దపల్లి రైల్వే స్టేషన్, పొత్కపల్లి మధ్యలో గురువారం ఉదయం ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడ్డాడు. అక్కడున్నోళ్లు పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో బాధితుడు వింతగా ప్రవర్తిస్తూ డాక్టర్లు, సిబ్బందిని దగ్గరకు రానివ్వకపోవడంతో అతడ్ని ఆస్పత్రిలోనే బెడ్కు కట్టేశారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం దాకా అలాగే కట్టేయడంతో బాధితుడు గాయాల బాధ భరించలేక చనిపోయాడు. ఈ విషయం రైల్వే పోలీసులకు చెప్పడంతో మృతుడి ఆధార్కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్ట్మార్టానికి అతడి డెడ్బాడీని మార్చురీలో పెట్టారు. రైలు నుంచి పడిపోయిన అతుల్ దాలీ చావుకు ఆస్పత్రి సూపరింటెండెంట్, డ్యూటీ డాక్టర్ కారణమని, వాళ్లపై చర్యలు తీసుకోవాలని స్థానిక టీఆర్ఎస్ లీడర్ బెక్కం ప్రశాంత్ వైద్యశాఖ రాష్ట్ర సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్ సూర్యశ్రీకి ఫిర్యాదు చేశారు.