పెళ్లి చేసుకుంటానంటూ మహిళలను మోసం చేసి, వారి వద్ద ఉన్న డబ్బును, విలువైన వస్తువులను దోచుకున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరుకు చెందిన టి మోహన్ రెడ్డిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఏడు వేర్వేరు కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు వివిధ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో తప్పుడు పేరుతో రిజిస్టర్ చేసుకుని విడాకులు తీసుకున్నవారు, వితంతువులతో సహా మహిళలతో సంబంధాలు ఏర్పరుచుకుని, మోసాలకు పాల్పడుతున్నాడని అధికారులు చెప్పారు.
మహిళలతో ఫోన్లో మాట్లాడిన తర్వాత, వ్యక్తిగతంగా సంభాషించడానికి వారిని హోటల్కి ఆహ్వానించేవాడు. మహిళలు వాష్రూమ్కు వెళ్లినప్పుడు లేదా వారి బ్యాగ్ లేదా ఇతర విలువైన వస్తువులను వదిలి బయటకు వెళ్లినప్పుడు, అతను వాటిని దొంగిలించి అక్కడ్నుంచి పారిపోతాడని పోలీసులు తెలిపారు. మోహన్ మొదట మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో ఫేక్ ఐడీని సృష్టించి, గౌతమ్ రెడ్డి అని నకిలీ పేరు పెట్టి, హైదరాబాద్లో రెండుసార్లు ఆమెను కలిసి.. ఆ తర్వాత ఒక మహిళను మోసం చేశాడని పోలీసులు తెలిపారు, ఆమెపై నమ్మకం పెంచి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని, ఏదో ఒక నెపంతో ఆమెకు తెలియకుండా క్రెడిట్ కార్డును అడిగాడన్నారు. ఆ తర్వాత రూ.6.21 లక్షల విలువైన ఆభరణాలు కొనుగోలు చేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడని మార్కెట్ పోలీసులు తెలిపారు.
అనంతరం నిందితులు విజయవాడలో నగలను విక్రయించారని పోలీసులు అన్నారు. మరొక సందర్భంలో, అతను తన ఖాతాలోకి రూ. 9 లక్షలు బదిలీ చేయమని ఒక మహిళను ఒప్పించాడని చెప్పారు. డబ్బు అందుకున్న తర్వాత ఆమెకు అందుబాటులో లేకుండా వెళ్లిపోయాడన్నారు. 2013లో ఓ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ.. అదే స్కూల్లోని విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడని కూడా వారు తెలిపారు.