కాకా ఫ్యామిలీని విమర్శిస్తే ఊరుకోం : మంచిర్యాల జిల్లా కాంగ్రెస్​ నేతలు

కాకా ఫ్యామిలీని విమర్శిస్తే ఊరుకోం : మంచిర్యాల జిల్లా కాంగ్రెస్​ నేతలు
  • ఐఎన్టీయూసీ లీడర్ సమ్మయ్య బేషరతుగా క్షమాపణలు చెప్పాలి

కోల్​బెల్ట్, వెలుగు: కాకా వెంకటస్వామి కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని, అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఎన్టీయూసీ లీడర్ కాంపెల్లి సమ్మయ్య బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్​ లీడర్లు డిమాండ్​ చేశారు. ఆదివారం మందమర్రి మండలం రామకృష్ణాపూర్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్, ఐఎన్టీయూసీ, అనుబంధ సంఘాల లీడర్లు మాట్లాడారు. చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వందల కోట్ల నిధులతో పనులు చేపడుతుంటే కనిపించడంలేదా అని ప్రశ్నించారు.

ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి ఎస్సీ వర్గీకరణను అడ్డుకోలే దని, మాలలకు న్యాయం చేయాలని కోరారని స్పష్టం చేశారు. ఐఎన్టీయూసీని బ్రష్టుపట్టించింది మీ అగ్ర నాయకుడని, ఆయన వల్లే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో యూనియన్​ఓడిపోయిందన్నారు. ఐఎన్టీయూసీకి సహకారం అందించింది ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి అనే విషయాన్ని గుర్తుచేసుకోవాలన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం, క్యాతనపల్లి, రామగుండం రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, జైపూర్ పవర్ ప్లాంట్ తీసుకొచ్చిన ఘనత కాకా కుటుంబానికి దక్కుతుందన్నారు.

స్వార్థం, సొంత ప్రయోజనాల కోసం ఇతర యూనియన్లలో చేరిన సంస్కృతి కాంపెల్లి సమ్మయ్యదని ఎద్దేవా చేశారు. కేవలం మంత్రి శ్రీధర్​ బాబు,  జనక్ ప్రసాద్ మెప్పు కోసం వివేక్​ వెంకటస్వామి, కాకా కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేసిన సమ్మయ్య బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. సమావేశంలో కాంగ్రెస్ ​టౌన్ ప్రెసిడెంట్​ పల్లె రాజు, ఐఎన్టీయూసీ ఏరియా వైస్​ప్రెసిడెంట్​ తేజావత్​ రాంబాబు, లీడర్లు ఓడ్నాల శ్రీనివాస్, మహంకాళి శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య, పలిగిరి కనకరాజు, వెంకన్న, గోపు రాజం, ఐఎన్టీయూసీ నాయకులు చంద్రగిరి ఎల్లయ్య, ఆకుల రాజన్న, ఎం.సుధాకర్, బి.వేణు, లాడెన్, కె.సురేందర్, బి.ప్రేమ్ సాగర్, రామకృష్ణ, బోనగిరి రవీందర్, భాస్కర్ రాంసాయి, సంపత్, కె.కనకయ్య, కె.రామస్వామి, ప్రకాశ్, నర్రా శ్రీనివాస్, మధునయ్య, దీప, సునీత, శారద తదిత రులు పాల్గొన్నారు.