చిరంజీవికి పద్మ విభూషణ్.. మంచు ఫ్యామిలీ రియాక్షన్

చిరంజీవికి పద్మ విభూషణ్.. మంచు ఫ్యామిలీ రియాక్షన్

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi)కి భారత రెండవ అత్యున్నత పురస్కారం దక్కింది. కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్(Padma Vibhushan) ప్రకటించింది. దేశంలోనే రెండో అత్యున్నతమైన అవార్డు చిరంజీవికి దక్కడంతో.. పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 1978లో కెరీర్ ప్రారంభించిన ఆయన ఇండస్ట్రీకి వచ్చాక చిరంజీవిగా పేరు మార్చుకున్నారు. స్వయం కృషితో  అలుపెరగకుండా సినిమాలు చేస్తూ.. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఇక మెగాస్టార్‌కు అవార్డు ప్రకటన రాగానే..  దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా చిరంజీవికి పద్మ విభూషణ్ రావడం పట్ల మంచు ఫ్యామిలీ నుంచి మోహన్‌ బాబు, విష్ణు స్పందించారు. నా ప్రియమైన స్నేహితుడు చిరంజీవికి శుభాకాంక్షలు. ఈ గౌరవానికి నువ్వు అర్హుడివి. ఈ గౌరవాన్ని పొందిన నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది. అంటూ ట్వీట్ చేశారు మోహన్ బాబు. ఇక మంచు విష్ణు స్పందిస్తూ.. నిద్ర లేవగానే ఇంత మంచి వార్త విన్నాను. చిరంజీవి గారికి ఎంతో విలువైన పద్మ విభూషణ్ రావడం చాలా ఆనందంగా ఉంది. మన తెలుగు సినీ పరిశ్రమకు ఈ అవార్డు గర్వ కారణం.. అంటూ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు విష్ణు. ప్రస్తుతం ఈ మంచు ఫ్యామిలీ చేసిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.