- జులై 2,3 తేదీల్లో జాతీయ రహదారుల దిగ్బంధనం,మహాధర్నా
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
పద్మారావునగర్, వెలుగు: ఎస్సీల వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సోమవారం పార్శిగుట్టలోని ఎమ్మార్పీఎస్ స్టేట్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే నెల 2, 3 తేదీల్లో సిటీలో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు రానున్న ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ముందు నిరసన తెలుపుతామన్నారు. జులై 2న సిటీకి వచ్చే అన్ని జాతీయ రహదారులపై బైఠాయించి, రోడ్లను దిగ్బంధనం చేస్తామన్నారు.