కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో స్థానికులకే ప్రయారిటీ : మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ

కాంట్రాక్ట్  ఉద్యోగాల్లో స్థానికులకే ప్రయారిటీ : మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ
  •     ఓసీపీ ఎక్స్​టెన్షన్​తో పట్టణాభివృద్ధి
  •  మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ

కోల్​బెల్ట్, వెలుగు: ఆర్కేపీ సింగరేణి ఓపెన్​ కాస్ట్​రెండో ఫేజ్​ఎక్స్​టెన్షన్ రామకృష్ణాపూర్​ పట్టణాభివృద్ధికి మరింత దోహదపడుతుందని, కాంట్రాక్ట్​ఉద్యోగాల్లో స్థానిక నిరుద్యోగులకు ప్రయారిటీ కల్పిస్తామని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్​.రాధాకృష్ణ అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్​ ఓసీపీ పీవో ఆఫీస్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓసీపీ ఎక్స్​టెన్షన్​మైన్​ వివరాలు వెల్లడించారు.

 రామకృష్ణాపూర్​లో మూసివేసిన ఆర్కే1, 1ఏ, 3, 4 గనుల్లో మిగిలిఉన్న బొగ్గును వెలికితీసేందుకు యాజమాన్యం ఆర్కేపీ ఓసీపీ రెండో ఫేజ్​ఎక్స్​టెన్షన్ ​మైన్​ను ఏర్పాటు చేయనుందన్నారు. ఓసీపీ ఎక్స్​టెన్షన్​తో 18 ఏండ్ల పాటు మైనింగ్​ కార్యకలాపాలు నిర్వహించవచ్చని తెలిపారు. ఏటా 2.50 మిలియన్​టన్నుల నుంచి 3.75 మిలియన్​టన్నుల వరకు సుమారు 32.67 మిలియన్​టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే ఛాన్స్​ ఉందన్నారు. రెండో ఫేజ్​లో 1209.249 హెక్టార్ల భూమి అవసరమన్నారు. 

ఇండ్లు, ప్రజలకు నష్టం జరగదు

ప్రాజెక్టు కోసం సింగరేణి యాజమాన్యం రూ.442.90 కోట్లను కేటాయించిందని చెప్పారు. పబ్లిక్​ హియరింగ్​లో అన్ని వర్గాలు పాల్గొని ఓసీపీ ఎక్స్​టెన్షన్​కు సహకరించాలని కోరారు. కొత్తగా ఓసీపీ ఎక్స్​టెన్షన్​వల్ల 156 మందికి సింగరేణి శాశ్వత ఉద్యోగులు,794 మందికి కాంట్రాక్ట్, ఆవుట్​సోర్సింగ్​ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అటవీ భూమి, ఈసీ పర్మిషన్ల కోసం యాజమాన్యం దరఖాస్తు చేసిందన్నారు. పట్టణంలోని ఆర్కే4 గడ్డ, శాంతినగర్​ ప్రాంతంలోని ఇండ్లకు, ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదన్నారు.

సీఎస్​ఆర్​ఫండ్స్​ రూ.109లక్షలతో అమరవాదితో పాటు మరో నాలుగు చెరువుల అభివృద్ధి పనులను చేపట్టనున్నామని జీఎం తెలిపారు. సమావేశంలో ఏస్వోటుజీఎం, ఆర్కేపీ ఓసీపీ ఇన్​చార్జ్ లలితేంద్రప్రసాద్, డీజీఎం (పర్సనల్)​ సీహెచ్.అశోక్, పర్సనల్ ​మేనేజర్​ఎస్.శ్యాంసుందర్, ఎన్విరాన్​మెంట్​ఆఫీసర్​ వెంకటరెడ్డి, సెక్యూరిటీ ఆఫీసర్​రవికుమార్, ఆర్కేపీ ఓసీపీ మేనేజర్​ పంకజ్​సింగ్, డీవైపీఎం సత్యనారాయణ​పాల్గొన్నారు.