
- హెచ్చరించిన మందమర్రి మండల కాంగ్రెస్ లీడర్లు
కోల్బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని మందమర్రి మండల కాంగ్రెస్ లీడర్లు హెచ్చరించారు. శనివారం మందమర్రిలోని ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గందె రాంచందర్, మాజీ సర్పంచ్ ఒడ్నాల కొమురయ్య తదితరులు మాట్లాడారు. మంత్రి వివేక్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తుంటే ఓర్వలేక బీఆర్ఎస్ లీడర్లు ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో బీఆర్ఎస్హయంలోనే విచ్చలవిడిగా ఇసుక, ఇతర దందాలు విచ్చలవిడిగా నడిచాయన్నారు.
వివేక్వెంకటస్వామి బాధ్యతలు చేపట్టాక వాటిని పూర్తిగా బంద్ చేయించారని, అందుకే జీర్జించుకోలేని బీఆర్ఎస్ లీడర్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. చెన్నూర్నియోజకవర్గంలో ఎక్కడా యూరియా కొరత లేదని, సరిపడే నిల్వలు ఉన్నాయన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్కరికి కూడా ఇండ్లు, రేషన్కార్డులు ఇవ్వలేదని.. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అర్హులకు ఇందిరమ్మ ఇండ్ల, కొత్త రేషన్ కార్డులు ఇస్తోందన్నారు. మంత్రి వివేక్పై ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశంలో మాజీ సర్పంచ్లు కమల మనోహర్రావు, అసంపల్లి రాజయ్య, గోదారి రాజేశ్, మాజీ ఎంపీటీసీ కుమారస్వామి, లీడర్లు రాయమల్లు, తాజోద్దిన్, రాములు, దుర్గం సుధాకర్తదితరులు పాల్గొన్నారు.