మంద మర్రి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నికలు

మంద మర్రి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నికలు

కోల్​బెల్ట్, వెలుగు:  మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రెస్​క్లబ్​ నూతన కమిటీ ఎన్నికలను బుధవారం  నిర్వహించారు. అధ్యక్ష పదవి కోసం జి.చందర్,తేల్ల విజయ్​కుమార్​,ఎం.డి.అక్బర్​ పోటీ పడ్డారు.చందర్​ సమీప ప్రత్యర్థి విజయ్​కుమార్​పై గెలిచారు.  జనరల్​ సెక్రటరీగా సలామొద్దీన్, అనిల్,  రమేశ్​ పోటీ పడగా సలామొద్దీన్.. అనిల్​పై​ గెలిచారు. కోశాధికారిగా సకినాల శంకర్​ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 

ఎన్నికల్లో మొత్తం 38 మంది క్లబ్​ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నూతన కమిటీ,పాత కమిటీ బాధ్యులను అడ్​హాక్​ కమిటీ,జర్నలిస్టు సంఘం జిల్లా బాధ్యులు​ రేణికుంట్ల శ్రీనివాస్​ సన్మానించారు.జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు జి.చందర్​ తెలిపారు.