కోమటిరెడ్డి బిజీగా ఉన్నడు.. అందుకే రాలేదు: థాక్రే

కోమటిరెడ్డి బిజీగా ఉన్నడు.. అందుకే రాలేదు: థాక్రే

కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నేతలతో మాట్లాడి వారి ఆలోచనలు తెలుసుకున్నానని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అన్నారు. నేతల మధ్య అసంతృప్తి తొలగిపోయిందని చెప్పారు. పార్టీ పటిష్టత కోసం పనిచేస్తామని వారంతా చేతిలో చేయి వేసి చెప్పారని ఠాక్రే వెల్లడించారు. ఏఐసీసీ ఆదేశాలకు అనుగుణంగా హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర సాగుతుందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా రెండు నెలల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు.

నియోజకవర్గంలో బిజీగా ఉండటం వల్లే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశానికి రాలేకపోయారని థాక్రే చెప్పారు. కోమటిరెడ్డికి ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. గాంధీభవన్‭లో జరిగే తదుపరి సమావేశాలకు ఆయన హాజరవుతారని వెల్లడించారు. ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని.. కాంగ్రెస్ నాయకులంతా కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని మానిక్ రావు ఠాక్రే వెల్లడించారు.