Nagarjuna,Anshu Saggar: 20 ఏండ్ల తరువాత మన్మధుడితో.. నాగ్ అసలేం మారలేదట!

Nagarjuna,Anshu Saggar: 20 ఏండ్ల తరువాత మన్మధుడితో.. నాగ్ అసలేం మారలేదట!

టాలీవుడ్ లో మన్మధుడు(Manmadudu) అంటే ఠక్కున గుర్తొచ్చే హీరో నాగార్జున(Nagarjuna). అది ఎంత ఫేమసో, ఆయన హీరోగా చేసిన మన్మధుడు సినిమా కూడా అంతే ఫేమస్. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా 2002 విడుదలై భారీ విజయాన్ని సాధించింది. త్రివిక్ర‌మ్(Trivikram) కథ, మాట‌లు కే.విజయభాస్కర్(K Vijayabhaskar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సోనాలి బింద్రే(Sonali Bindre), అన్షు స‌గ్గ‌ర్(Anshu Saggar) హీరోయిన్‌లుగా న‌టించారు.

అయితే ఈ సినిమా టాలీవుడ్ లోకి బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది అన్షు స‌గ్గ‌ర్. సినిమాలో మహి పాత్రలో కనిపించిన ఆమె తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పాత్ర చిన్నదే అయినా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ బ్యూటీ. ఇక మన్మధుడు మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో ఈ తర్వాత మంచి అవకాశాలు అందుకున్నారు అన్షు. ప్రభాస్ తో రాఘవేంద్ర మూవీలో ఛాన్స్ దక్కించుకున్నారు. కానీ, ఆ సినిమాతో పరాజయాన్ని చవిచూసింది. 

ఆ తరువాత నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆమె.. చాలా కావాలంగా ఇంగ్లాడ్ లో సెటిల్ అయ్యారు. తాజాగా ఆమె మన్మధుడు నాగార్జున‌ను కలిశారు. ఈ సంద‌ర్భంగా మన్మధుడు సినిమా జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇందుకు సంబందించిన ఫోటోలను షేర్ చేస్తూ.. దాదాపు 20 సంవత్సరాల క్రితం మన్మథుడు సినిమాలో నాగార్జున స‌ర్‌తో కలిసి న‌టించాను. మ‌ళ్లీ ఇప్పుడు ఇన్నేండ్ల త‌ర్వాత ఆయన్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఏమాత్రం మారలేదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు కాలాన్ని మరిపిస్తాయి.. అంటూ రాసుకోచ్చారు అన్షు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.