బెంగాల్ మంత్రి మనోజ్ తివారీ రంజీ ట్రోఫీలో తన ఫామ్ను కొనసాగిస్తున్నాడు వరుసగా రెండో సెంచరీని కొట్టాడు. జార్ఖండ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో 136 పరుగులు చేసిన తివారీ, మధ్యప్రదేశ్తో జరుగుతున్న సెమీ-ఫైనల్ పోరులో కూడా సెంచరీ బాదాడు. సెంచరీ చేయగానే జేబులోంచి ఓ లేఖను తీసి కెమెరాల వైపు చూపించాడు. ఆ లేఖలో ‘ఐ లవ్యూ సుస్మిత (మై స్వీటీపై)’ అని రాసి ఉంది. తివారి భార్య పేరు సుస్మిత.
దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వచ్చేసరికి ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో మధ్యప్రదేశ్ జట్టు 341 పరుగులకు ఆలౌట్ అయింది. అ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన బెంగాల్ టీమ్ కేవలం 54 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన తివారి.. 211 బంతుల్లో 102 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. తివారికి తోడుగా షాబాజ్ అహ్మద్ (116) రాణించాడు. కాగా మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో తివారి యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నాడు.
Manoj Tiwary celebration when he was completed his Hundred in the Ranji trophy semifinal - A special note for his family - Beautiful. pic.twitter.com/8SY22amUn5
— CricketMAN2 (@ImTanujSingh) June 16, 2022