నేను ఏ తప్పు చేయలేదు.. తప్పు చేస్తే కేసీఆర్ టికెట్ ఇచ్చేవారు కాదు : పుట్ట మధు

నేను ఏ తప్పు చేయలేదు.. తప్పు చేస్తే కేసీఆర్ టికెట్ ఇచ్చేవారు కాదు : పుట్ట మధు

హైదరాబాద్ : తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలే అన్నారు మంథని జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధు. తాను తప్పు చేసుంటే కేసీఆర్ తనకు మంథని ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు. మంథని టికెట్ కేసీఆర్ తనకు కేటాయించడంతో ఎన్నికల్లోకి వెళ్తునన్నారు. తనపై సోషల్ మీడియా, మీడియాలో వచ్చేవి కథనాలన్నీ నిజం కావన్నారు. 

తనపై వచ్చిన ఏ ఒక్క ఆరోపణ కూడా రుజువు కాలేదని చెప్పారు పుట్ట మధు. రాబోయే ఎన్నికల్లో మంథని నుంచి ఎమ్మెల్యేగా గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. నెక్లెస్ రోడ్ జలవిహార్ లో మున్నూరు కాపు ప్లీనరీ సన్నాహక సభ నిర్వహించారు. ఈ సభకు మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో పాటు మున్నూరు కాపు ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.