
న్యూఢిల్లీ: మనదేశ తయారీ రంగం వృద్ధి గత నెల 14 నెలల గరిష్ట స్థాయికి 58.4కి పెరిగింది. ఉత్పత్తి, కొత్త ఆర్డర్లు, ఉపాధి పెరగడమే ఇందుకు కారణమని మంగళవారం నెలవారీ సర్వే తెలిపింది. ఈ రంగం పనితీరును కొలిచే హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్పర్చేజింగ్ మేనేజర్స్ఇండెక్స్(పీఎంఐ) మే నెలలో 57.6గా నమోదయింది.
ఇది 50 కంటే ఎక్కువ ఉంటే విస్తరిస్తున్నట్టు అర్థం. జూన్లో కొత్త ఆర్డర్ల ఇన్ఫ్లోలు కూడా వేగంగా పెరిగాయని, విస్తరణ రేటు దాదాపు ఒక సంవత్సరంలోనే అత్యంత బలంగా ఉందని హెచ్ఎస్బీసీలో చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ ప్రాంజుల్ భండారి అన్నారు.