
న్యూఢిల్లీ: మనదేశ తయారీ రంగం గత నెల ఇది పది నెలల గరిష్టానికి చేరుకుంది. 2024 జూన్ తర్వాత ఇదే అత్యధికమని నెలవారీ సర్వే తెలిపింది. సీజనల్గా మారే హెచ్ఎస్బీసీ ఇండియా పర్చేజింగ్మేనేజర్స్ఇండెక్స్ (పీఎంఐ) మార్చిలో 58.1 నుంచి ఏప్రిల్లో 58.2కి పెరిగింది.పీఎంఐ 50 కంటే ఎక్కువ ఉంటే విస్తరణను సూచిస్తుంది.
అంతర్జాతీయ ఆర్డర్లలో భారీ పెరుగుదల అమ్మకాలను పెద్ద ఎత్తున పెంచింది. 2025–-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో విదేశాల నుంచి కొత్త వ్యాపారం 14 సంవత్సరాలలో అత్యధిక స్థాయికి పెరిగాయని హెచ్ఎస్బీసీ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ ప్రాంజుల్ చెప్పారు.