న్యూఢిల్లీ : అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి పలువురు పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. బిలియనీర్ ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబంతో పాటు ఉక్కు వ్యాపారవేత్త లక్ష్మి మిట్టల్, ఎయిర్టెల్ చీఫ్ సునీల్ భారతి మిట్టల్, రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్పర్సన్ కుమార్ మంగళం బిర్లా, ఆయన కుమార్తె అనన్య బిర్లా అయోధ్యకు వచ్చారు.
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని రిలయన్స్ తన ఉద్యోగులందరికీ సెలవు ఇచ్చింది. దేశవ్యాప్తంగా తన ఆఫీసుల్లోని డజనుకు పైగా దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. వేడుకకు ఆహ్వానం అందిన వారిలో బిలియనీర్ గౌతమ్ కూడా ఉన్నారు. ఎస్సార్ క్యాపిటల్ డైరెక్టర్, - ఎస్సార్ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ ప్రశాంత్ రుయా, జోహో సీఈఓ శ్రీహర్ వెంబు, ఈజ్మై ట్రిప్ కో–-ఫౌండర్ నిశాంత్ పిట్టి, స్పైస్జెట్అధిపతి అజయ్సింగ్సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు.