అయోధ్యలో పలు కంపెనీల​ బాస్​లు

అయోధ్యలో పలు కంపెనీల​ బాస్​లు

న్యూఢిల్లీ :  అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి పలువురు పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.  బిలియనీర్ ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబంతో పాటు ఉక్కు వ్యాపారవేత్త లక్ష్మి   మిట్టల్, ఎయిర్​టెల్​ చీఫ్​ సునీల్ భారతి మిట్టల్, రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ,  ఆదిత్య బిర్లా గ్రూప్  చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ కుమార్ మంగళం బిర్లా, ఆయన కుమార్తె అనన్య బిర్లా అయోధ్యకు వచ్చారు.

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని రిలయన్స్​ తన ఉద్యోగులందరికీ సెలవు ఇచ్చింది. దేశవ్యాప్తంగా తన ఆఫీసుల్లోని డజనుకు పైగా దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. వేడుకకు ఆహ్వానం అందిన వారిలో బిలియనీర్ గౌతమ్ కూడా ఉన్నారు. ఎస్సార్ క్యాపిటల్ డైరెక్టర్, - ఎస్సార్ గ్రూప్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ మేనేజర్ ప్రశాంత్ రుయా, జోహో సీఈఓ శ్రీహర్ వెంబు, ఈజ్​మై ట్రిప్​ కో–-ఫౌండర్​ నిశాంత్ పిట్టి, స్పైస్​జెట్​అధిపతి అజయ్​సింగ్​సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు.