ధరలను పెంచిన మారుతీ సుజుకీ

ధరలను పెంచిన మారుతీ సుజుకీ

 న్యూఢిల్లీ : మారుతీ సుజుకీ ఇండియా తన వెహికల్స్​ ధరలను పెంచినట్టు మంగళవారం తెలిపింది. సగటు పెరుగుదల 0.45 శాతం అని ఇది రెగ్యులేటరీ ఫైలింగ్‌‌లో పేర్కొంది. ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధరల ఆధారంగా పెంపు ధర ఉంటుందని, కొత్త ధరలు జనవరి 16 నుంచి అమల్లోకి వచ్చాయని మారుతి సుజుకి ఇండియా ప్రకటించింది. ఈ కంపెనీ ఆల్టో నుంచి ఇన్విక్టో వరకు పలు కార్లను అమ్ముతోంది. వీటి ధరలు రూ. 3.54 లక్షల నుంచి-28.42 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.