
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో మాస్క్ను తప్పనిసరి చేసింది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం, న్యూఇయర్సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆయన సూచించారు. అలాగే, డిసెంబరు 31, జనవరి 1న సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసినట్టు తెలిపారు. జనవరి 2, 3 తేదీల్లో సిఫారసు లేఖలు కూడా స్వీకరించమని చెప్పారు.
ఏకాదశి రోజున ఉదయం 6 గంటల నుంచి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చన్నారు. జనవరి 2 నుంచి 11 వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని, రోజుకు వెయ్యి మంది చొప్పున 10 రోజుల పాటు దర్శనం కల్పిస్తామని తెలిపారు. ఈ నెల 29 నుంచి జనవరి 3 వరకు అడ్వాన్స్డ్ విధానంలో వసతిగదుల కేటాయింపు కూడా రద్దు చేసినట్లు టీటీడీ చైర్మన్ వెల్లడించారు.