థాయ్లాండ్‌ కాల్పులు.. 34 మంది మృతి..

థాయ్లాండ్‌ కాల్పులు.. 34 మంది మృతి..

బ్యాంకాక్‌ : థాయ్లాండ్‌లో దారుణం జరిగింది. నార్త్ఈస్ట్ర‌న్ ప్రావిన్సులోని చిల్డ్ర‌న్ డే కేర్ సెంట‌ర్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 34 మంది చనిపోయారు. వారిలో 22మంది చిన్నారులు ఉన్నారు. కాల్పులకు పాల్పడింది మాజీ పోలీస్ ఆఫీసర్ అని దర్యాప్తులో తేలింది. మాదక ద్రవ్యాలు వాడినట్లు తేలడంతో ఏడాది క్రితం అతన్ని విధుల నుంచి తప్పించారు. ఈ కేసుకు సంబంధించి అతను శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా ఇంతలోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. మారణహోమానికి పాల్పడిన దుండగుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే ఈ ఘటన అనంతరం దుండగుడు తన కుటుంబసభ్యులను హత్య చేయడంతో పాటు తనను తాను కాల్చుకున్నట్లు సమాచారం.

ఇతర దేశాలతో పోలిస్తే థాయిలాండ్ లో ఇలాంటి కాల్పుల ఘటనలు జరగడం అత్యంత అరుదు. 2020లో ఓ సైనికుడు ప్రాపర్టీ విషయంలో జరిగిన గొడవలో కాల్పులు జరిపాడు. ఆ ఘటనలో 29 మంది మరణించగా.. 57 మంది గాయపడ్డారు.