టోల్బూత్ ను ఢీకొట్టిన అంబులెన్స్..నలుగురు మృతి

టోల్బూత్ ను ఢీకొట్టిన అంబులెన్స్..నలుగురు మృతి

కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న అంబులెన్స్ అదుపుతప్పి టోల్ బూత్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. వర్షానికి టోల్ ప్లాజా వద్ద రోడ్డు తడిగా ఉంది. అంబులెన్స్ వేగంగా వస్తుండడాన్ని గమనించిన సిబ్బంది ప్రత్యేక లైన్ లో దానికి దారి ఇచ్చేందుకు..అడ్డుగా ఉన్న బారికేడ్లను తొలగించారు. అయితే అదుపుతప్పిన అంబులెన్స్ టోల్ క్యాబిన్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి అంబులెన్స్ లో ఉన్న రోగి సహా ఇద్దరు సహాయకులు ఎగిరిపడ్డారు. ఇక డ్రైవర్ కు తీవ్రగాయాలవగా..ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.