
జార్ఖండ్ ధన్ భాద్ లోని ఆశీర్వాద్ అపార్ట్ మెంట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది సజీవ దహనం అయ్యారు. వీరిలో 10 మంది మహిళలు, ముగ్గురు పిల్లలు, ఓ వ్యక్తి ఉన్నారు. 13 అంతస్తుల అపార్ట్ మెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫస్ట్ రెండో అంతస్తులో మొదలైన మంటలు ఆ తర్వాత మిగతా అంతస్తులకు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఈ అపార్ట్ మెంట్ లో 400 మందికి పైగా ఉంటున్నారని తెలుస్తోంది. ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ధన్ బాద్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు.