ఉత్తర్ ప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఏప్రిల్ 20వ తేదీ శనివారం ఉదయం ఘజియాబాద్లోని ఖోడా ప్రాంతంలోని ఓ గోదాములో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం సంఘటనాస్థలంలో అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయని స్పందించిన చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాహుల్ పాల్ తెలిపారు.
ఈ రోజు ఉదయం ఖోడా కాలనీలోని గోడౌన్లో అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులకు సమాచారం అందిందని.. వెంటనే, వైశాలి ఫైర్ స్టేషన్ నుండి మూడు అగ్నిమాపక దళ బృందాలు, సాహిబాబాద్ స్టేషన్ నుండి రెండు, కొత్వాలి స్టేషన్ నుండి మూడు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని చెప్పారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని రాహుల్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.
#WATCH | Uttar Pradesh: A massive fire broke out at a warehouse in the Khoda area of Ghaziabad, earlier today. Firefighting operations are underway. Details awaited.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 20, 2024
(Source: Fire Department, Ghaziabad) pic.twitter.com/9PPscczGdN