రెండువేల మందితో.. ఎన్టీఆర్ భారీ యాక్షన్ సీక్వెన్స్..

రెండువేల మందితో.. ఎన్టీఆర్ భారీ యాక్షన్ సీక్వెన్స్..

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కేజీయఫ్, సలార్ తర్వాత నీల్ రూపొందిస్తున్న చిత్రం కావడంతో దీనిపై  భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. హైద‌‌‌‌రాబాద్ రామోజీ ఫిలిం సిటీలో చిత్రీక‌‌‌‌ర‌‌‌‌ణ జ‌‌‌‌రుగుతోంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌పై  కీల‌‌‌‌క స‌‌‌‌న్నివేశాలు చిత్రీక‌‌‌‌రిస్తున్నారు. రెండు వేల మంది జూనియ‌‌‌‌ర్ ఆర్టిస్టుల మ‌‌‌‌ధ్యలో తార‌‌‌‌క్ ఉన్న సీన్స్‌‌‌‌ను షూట్ చేస్తున్నారు. 

ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్‌‌‌‌గా నిలుస్తుందని తెలుస్తోంది.  ఎన్టీఆర్ కెరీర్‌‌‌‌‌‌‌‌లో 31వ చిత్రంగా తెరకెక్కుతోన్న  ఈ చిత్రానికి  ‘డ్రాగన్‌‌‌‌’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో ఎన్టీఆర్ సరికొత్త మేకోవర్‌‌‌‌‌‌‌‌తో కనిపించనున్నాడు.  రుక్మిణీ వసంత్ హీరోయిన్‌‌‌‌గా, టొవినో థామస్ కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తోంది.  

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌‌‌‌పై కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.  వచ్చే ఏడాది జూన్ 25న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా సినిమా విడుదల కానుంది.