ఢిల్లీ ఫుల్ ట్రాఫిక్ జామ్​

ఢిల్లీ ఫుల్ ట్రాఫిక్ జామ్​

ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఘాజిపూర్ బార్డర్ వద్ద పోలీసులు చెక్​పోస్ట్ ఏర్పాటు చేశారు. ఒకసారి రెండు వెహికల్స్ మాత్రమే వెళ్లేందుకు వీలుగా బారికేడ్లు పెట్టారు. సిటీ చుట్టూ ఉన్న ఎంట్రీ పాయింట్ల వద్ద ఇలాంటి ఏర్పాట్లే చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. కిలో మీటర్ ప్రయాణానికి కొన్ని గంటల సమయం పడుతున్నది. అంబులెన్స్​లు కూడా వెళ్లని పరిస్థితి. రోజుకు ఢిల్లీ, గురుగ్రామ్ మధ్య రెండు లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఢిల్లీ –  మీరట్ ఎక్స్​ప్రెస్ వే మీద కూడా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.