ప్రవేశపెట్టిన కేరళ ప్రభుత్వం
తిరువనంతపురం: ప్రైవేట్ ఎడ్యుకేషన్ సెక్టార్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, టీచర్లకు కేరళ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక నుంచి వారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగుల మాదిరిగానే మెటర్నటీ బెనిఫిట్స్ ఇవ్వనుంది. మెటర్నటీ బెనిఫిట్ యాక్ట్ కింద 26 వారాలు జీతంతో కూడిన సెలవు ఇవ్వనున్నారు. ప్రైవేట్ ఎడ్యుకేషన్ సెక్టార్లోని ఎంప్లాయిస్, టీచర్లను మెటర్నటీ బెనిఫిట్ యాక్ట్లోకి తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం కేరళ అని అధికారులు చెప్పారు.