మే 3న తెలుగులో బాక్.. భయపెడుతూ నవ్విస్తుంది

మే 3న తెలుగులో బాక్.. భయపెడుతూ నవ్విస్తుంది

సుందర్ సి, తమన్నా భాటియా, రాశీ ఖన్నా లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కిన తమిళ చిత్రం ‘అరణ్మనై 4’. సుందర్ సి దర్శకుడు. ఖుష్బు, అరుణ్ కుమార్ నిర్మించారు. మే 3న తెలుగులో ‘బాక్‌‌‌‌‌‌‌‌’ పేరుతో విడుదల కానుంది. ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. రాశీ ఖన్నా మాట్లాడుతూ ‘డైరెక్టర్ సుందర్ చాలా క్లియర్ విజన్‌‌‌‌‌‌‌‌తో సినిమా తీశారు. నాకు హారర్ సినిమాలు ఎంతో ఇష్టం. కానీ అవి తీయడం ఎంత కష్టమో ‘అరణ్మనై 3’కి అర్థమైంది. ఈసారి గ్లామర్ పెరిగింది. ఇందులో హారర్, గ్లామర్, థ్రిల్, కామెడీ అన్నీ వున్నాయి. పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్ ఇది’ అని చెప్పింది. తమన్నా మాట్లాడుతూ ‘చాలా కొత్త అనుభూతిని ఇచ్చే సినిమా ఇది. ‘బెంగాల్ టైగర్’ నుంచి రాశీ ఖన్నాను చూస్తున్నా. ఈ మూవీ ప్రమోషనల్ సాంగ్ చేసినప్పుడు ఇద్దరం కలసి చాలా ఎంజాయ్ చేశాం.  సుందర్ గారి విజన్‌‌‌‌‌‌‌‌ను అర్ధం చేసుకొని ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వలానే లక్ష్యంతో పని చేశాం. తప్పకుండా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పింది. నిర్మాత ఖుష్బు సుందర్ మాట్లాడుతూ ‘ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అస్సామీ జానపదంలో ‘బాక్’ అనే దెయ్యం ఉండేదని స్క్రిప్ట్ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌లో తెలిసింది. అందుకే ఈ టైటిల్ పెట్టాం. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తెలుగులో రిలీజ్ చేస్తున్న సురేష్ గారికి, నారంగ్ గారికి థ్యాంక్స్‌‌‌‌‌‌‌‌’ అని చెప్పారు. ‘భయపెడుతూ నవ్వించే సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు ఎంజాయ్ చేసేలా సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీశారు’ అని కోవై సరళ చెప్పారు. తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయడం సంతోషంగా ఉందని నిర్మాత జాన్వీ నారంగ్ అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.