
ఎయిరిండియాను టేకోవర్ చేసుకున్న టాటా గ్రూప్ ను భారత పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అభినందించారు. ఎయిరిండియాకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని..టాటా గ్రూపు విజయంపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. టాటా సవాళ్లను అధిగమిస్తుందన్నారు. ఎయిరిండియాను విజయవంతంగా నడిపించేందుకు ప్రతిభ, అవసరమైన వనరులు అందించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందనే నమ్మకం ఉందన్నారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎయిరిండియాను నష్టాలతో నెట్టుకురావడంతో ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఇప్పుడు టాటాగ్రూపు దాని లావాదేవీలు మొత్తం కంప్లీట్ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ నిర్ణయంతో తాను మాత్రమే కాదని..భారతదేశ ప్రజలందరూ ప్రయోజనం పొందుతారని చెప్పారు.
మరిన్ని వార్తల కోసం