మిజోరంలో కూలిపోయిన మయన్మార్ ఆర్మీ విమానం..

మిజోరంలో కూలిపోయిన మయన్మార్ ఆర్మీ విమానం..

 మిజోరంలో ఘోర ప్రమాదం జరిగింది. లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో మయన్మార్ సైనిక విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే మయన్మార్ ఆర్మీకి చెందిన ఆర్మీ విమానం మిజోరం లోని లెంగ్ పుయ్ విమానశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు వచ్చింది. ఈ సమయంలో విమానం అధుపు తప్పి కూలిపోయింది. 

ఈ విమానంలో పైలట్‌తో పాటు మొత్తం 14 మంది ఉన్నారని మిజోరం డీజీపీ తెలిపారు. 8మంది సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. 6గురు గాయపడ్డారని వారందరినీ లెంగ్‌పుయ్‌ ఆస్పత్రిలో చేర్పించామని అన్నారు.