శివ్వంపేట, వెలుగు: కారు ఢీకొని తల్లి మృతిచెందగా.. కుమారుడికి తీవ్ర గాయాలైన ఘటన మెదక్జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివ్వంపేట మండలంలోని బిజిలిపూర్ కు చెందిన సాదిక్ బుధవారం రాత్రి తల్లి జుబేదా బేగం(50)తో కలిసి బైక్పై గోమారం వెళ్తున్నాడు.
గోమారం గ్రామ శివారులో నర్సాపూర్ నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జుబేదా బేగం తీవ్రంగా గాయపడి స్పాట్ లోనే మృతి చెందింది. సాదిక్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
