మేడారం సమ్మక్క సారాలమ్మ మహా జాతర సందర్భంగా వనదేవతల పూజారులు మండమలిగే పండగను ఘనంగా నిర్వహించారు. జాతర ప్రశాంతంగా జరగడం సహా భక్తులు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ కన్నెపల్లి, మేడారాలకు రక్ష కంకణాలు కట్టి ద్వార స్తంభాలు ఎత్తారు.
మేడారంలోని పూజారి సిద్ధబోయిన లక్ష్మణరావు ఇంటినుంచి మామిడి తోరణాలు, పసుపు, కుంకుమ, నీళ్లు తీసుకుని వెళ్లి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. దీంతో కన్నెపల్లి, మేడారంలోని ప్రతి ఇళ్లు పండగ శోభను సంతరించుకున్నాయి.