కామారెడ్డి కలెక్టరేట్ లో మీడియా సెంటర్ ప్రారంభం

కామారెడ్డి కలెక్టరేట్ లో మీడియా సెంటర్ ప్రారంభం

కామారెడ్డిటౌన్​, వెలుగు : మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా  కామారెడ్డి కలెక్టరేట్​లో గురువారం మీడియా సెంటర్​ను అడిషనల్ కలెక్టర్లు మదన్మోహన్, విక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల నియమాళి ప్రకారం మీడియా పర్యవేక్షణ ఉండాలన్నారు. పేపర్లు, టీవీల్లో ప్రసారమయ్యే ఫెయిడ్ న్యూస్​ను గుర్తించి వాటిని రిజిస్ట్రర్లలో నమోదు చేయాలని సూచించారు. డీపీఆర్​వో తిరుమల, మైనార్టీ అధికారి అర్షత్ అలీ తదితరులు పాల్గొన్నారు.