3 లోక్ సభ సీట్లపై మీనాక్షి నటరాజన్ మీటింగ్..అటెండ్ అయిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

3 లోక్ సభ సీట్లపై మీనాక్షి నటరాజన్ మీటింగ్..అటెండ్ అయిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పార్లమెంట్ సీట్లపై ఏఐసీసీ రాష్ర్ట వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో చేవేళ్ల, మహబూబ్ నగర్, హైదరాబాద్ లోక్ సభ సీట్లపై సుమారు 2 గంటలు పాటు సమావేశమయ్యారు.  మొత్తం 17 సీట్లు ఉండగా ఇప్పటి వరకు 10 సీట్ల మీటింగ్ లు పూర్తి అయ్యాయి. 

ఈ మీటింగ్ కంటెస్టెడ్ ఎంపీ , ఎమ్మెల్యే అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షులు అటెండ్ అయ్యారు.  ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ స్కీమ్ లపై ప్రజల అభిప్రాయాలు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మీనాక్షి నటరాజన్ దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. 

పార్టీని బలోపేతం చేయాలని, విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా ఉండాలని, పార్టీ కమిటీలు, ప్రభుత్వ పదవుల్లో నేతలకు కచ్చితంగా అవకాశాలు ఉంటాయని, పార్టీ గెలుపు కోసం పనిచేసిన నేతలపై పూర్తి సమాచారం తన దగ్గర ఉందని నేతలతో మీనాక్షి అన్నట్లు సమాచారం. మీటింగ్ పై నేతలు ఎవరూ మీడియాతో మాట్లాడకపోవటం గమనార్హం. రేపు మరికొన్ని నియోజకవర్గాలపై మీనాక్షి నటరాజన్ మీటింగ్ నిర్వహించనున్నారు.