సినిమా టికెట్ల ధరలపై నెలకొన్న వివాదాన్ని ఓ కొలిక్కి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 10న సీఎం జగన్మోహన్ రెడ్డి..సినీ ప్రముఖులతో సమావేశం కానున్నారు. ఇందులో చిరంజీవి,నాగార్జునతో పాటు పలువురు ప్రముఖులు భేటీ కానున్నారు.
ఇదే విషయంపై ఇవాళ( మంగళవారం) రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని సీఎం జగన్ తో సమావేశమయ్యారు. టికెట్ల ధరలు, సినిమా థియేటర్ల యజమానుల సమస్యలు, ఇటీవల టికెట్ల ధరలపై ప్రభుత్వ కమిటీ అధ్యయనం తదితర అంశాలపై ఆయన సీఎంతో చర్చించారు.రేపు మరో సారి సీఎం జగన్తో భేటీ కానున్నారు మంత్రి పేర్ని నాని.
మరిన్ని వార్తల కోసం..