
ఏపీ పునర్విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ వర్చువల్ గా భేటీ అయ్యింది. ఏపీ ప్రభుత్వం వేసిన కేసులు ఉపసంహరించుకుంటే ఇతర సమస్యలు పరిష్కరించుకునేందుకు సిద్ధమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలకు తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలు, పన్నుల విషయంలో లోపాల తొలగింపు, నగదు నిల్వలు, డిపాజిట్ల విభజన, ఏపీ, తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ల క్యాష్ క్రెడిట్ వ్యవహారంపై ఈ భేటీలో చర్చించారు. అయితే.. భేటీలో రెండు రాష్ట్రాల అధికారులు ఏకాభిప్రాయానికి రాలేదు.