
మంచిర్యాల, వెలుగు: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖ, ఆర్వీఎం హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఈ నెల 7న మంచిర్యాలలోని ఎఫ్సీఏ హాల్లో మెగా సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్టు ప్రోగ్రాం ఆర్గనైజర్ వి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్లను బుధవారం రిలీజ్ చేశారు.
ఈ శిబిరంలో గుండె సమస్యలు, క్యాన్సర్, జనరల్ ఫిజీషియన్, న్యూరో, రేడియాలజీ, నెఫ్రాలజీతో పాటు జీర్ణకోశ వ్యాధులకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తారని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఐఆర్సీఎస్ ప్రతినిధులు మహేందర్, సత్యపాల్ రెడ్డి, కె.శ్రీనివాస్, శంకర్ వర్మ, సత్యనారాయణ రెడ్డి, చంద్రమోహన్ గౌడ్ పాల్గొన్నారు.