తండ్రిని గుర్తుచేసుకుంటూ చిరు ఎమోషనల్ పోస్ట్

తండ్రిని గుర్తుచేసుకుంటూ చిరు ఎమోషనల్ పోస్ట్

తన తండ్రి వెంకట్రావు వర్ధంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ‘‘మాకు జన్మనిచ్చి, క్రమశిక్షణతో పెంచి, జీవితపు ఒడిదొడుకుల పట్ల అవగాహన పంచి, మా కృషిలో ఎప్పుడూ తోడుగా ఉండి, మా విజయాలకు బాటను ఏర్పరిచిన మా తండ్రి వెంకట్రావు గారిని స్మరించుకుంటూ’’ అంటూ చిరు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తల్లి అంజనాదేవి, సోదరుడు నాగబాబు, సోదరీమణులతో కలిసి చిరు.. తన తండ్రి వెంకట్రావుకు నివాళులు అర్పించారు.  

ఇక మరో పిక్ లో తన తమ్మళ్లు నాగబాబు, పవన్‌కల్యాణ్‌, సోదరీమణులతో కలిసి తన తల్లీదండ్రులతో దిగిన ఓ అపురూప చిత్రాన్ని ఈ సందర్భంగా చిరు షేర్ చేశారు. మెగా ఫ్యామిలీకి చెందిన ఈ పిక్  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ప్రస్తుతం చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో నటిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చిరుకు జోడీగా  శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కానుంది.