మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine). కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా(Shakthi Pratap singh Hada) తెరకెక్కించిన ఈ సినిమాని సోనీ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా మార్చ్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవిక సంఘటనల ఆధారంగా వస్తున్న ఈ సినిమా మార్చ్ 1న తెలుగు, హిందీ భాషలో థియేటర్స్ లోకి రానుంది. ఇందులో భాగంగా తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.
ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన తెలుగు సినిమా, డైరెక్టన్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆపరేషన్ వాలెంటైన్ గురించి మెగాస్టార్ మాట్లాడుతూ.. ఆపరేషన్ వాలెంటైన్ సినిమాను దర్శకుడు శక్తి ప్రతాప్ కేవలం 75 రోజుల్లోనే తెరకెక్కించారు. అది కూడా లిమిటెడ్ బడ్జెట్లో. అంత తక్కువ బడ్జెట్ లో ఆ రేంజ్ విజువల్స్ చూసి నాకు ఆశ్చర్యం కలుగుతోంది.
కేవలం డబ్బు ఖర్చు చేస్తేనే కాదు.. తక్కువ బడ్జెట్లో కూడా రిచ్గా ఎలా చూపించగలం అని దర్శకులు ఆలోచించుకోవాలి. అప్పుడు నిర్మాతలు బాగుంటారు, వాళ్ళు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇటీవల నేను నేను టాప్గన్ మూవీ చూశాను. విజువల్స్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. మనం ఇలా తీయగలమా అనుకున్నాను. ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ చూశాక మనవాళ్లు కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా విజువల్స్ క్రియేట్ చేస్తున్నారు అనిపించింది. అందుకే నేనెప్పుడూ అంటాను.. ప్రతిభ ఎవడి సొత్తు కాదు అని. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలుస్తుంది అంటూ చెప్పుకొచ్చారు మెగాస్టార్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.