జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడిని పరామర్శించారు మెగాస్టార్ చిరంజీవి. ఆరోగ్యం బాగా లేదన్న విషయం తెలిసిన వెంటనే ఆదివారం స్వయంగా రామ్మోహన్ నాయుడి ఇంటికి వెళ్లి మరీ ధైర్యం చెప్పడమే కాకుండా.. స్వస్థత చేకూరేందుకు అన్ని రకాలుగా ఆదుకుంటామని చిరు హామీ ఇచ్చారు. వెంటనే ఆయన్ని మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్ AIG హాస్పిటల్ లో చికిత్సను అందించే ఏర్పాటు చేశారు.
జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడు ప్రజారాజ్యం పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్రను పోషించిన విషయం తెలిసిందే. ప్రలోభాలకు లొంగకుండా నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఉన్నది ఉన్నట్లుగా రాసే జర్నలిస్టుగా రామ్మోహన్ నాయుడుకి ఎంతో పేరు ఉందని తెలిపారు చిరంజీవి. నిబద్ధత కలిగిన పాత్రికేయులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఎంతో ఉందని.. రామ్మోహన్ త్వరగా కోలుకోవాలన్నారు.