వ్యాధి నుంచి కోలుకున్న వారు ప్లాస్మా డొనేట్‌ చేయండి: మెగాస్టార్‌‌

వ్యాధి నుంచి కోలుకున్న వారు ప్లాస్మా డొనేట్‌ చేయండి: మెగాస్టార్‌‌

హైదరాబాద్‌: కరోనా నుంచి కోలుకున్న వారు స్వచ్చంధంగా ముందుకు వచ్చి రోగుల ప్రాణాలు కాపాడాలని మెగాస్టార్‌‌ చిరంజీవి పిలుపునిచ్చారు. ప్లాస్మాను దానం చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. ఈ మేరకు మెగాస్టార్‌‌ శనివారం ట్వీట్‌ చేశారు. “ కరోనాను జయించిన వారికి ఇదే నా అపీల్‌. రికవరీ అయిన​ వాళ్లు ముందుకు వచ్చి ప్లాస్మాను డొనేట్‌ చేయండి. ప్రాణాలను కాపాడండి. మహమ్మారి ప్రబలుతున్న వేళ ఇంత కంటే మానవత్వం ఇంకోటి లేదు. కరోనా వారియర్స్‌ ఇప్పుడు ప్రాణ రక్షకులుగా మారండి” అని చిరు ట్వీట్‌ చేశారు. ఈ మేరకు సీపీ సజ్జనార్‌‌ పాస్ల్మా డోనేషన్‌ గురించి మాట్లాడుతున్న వీడియోను కూడా ట్వీట్‌ చేశారు.