రాష్ట్రానికి మీరాకుమార్

రాష్ట్రానికి మీరాకుమార్
  • ఇయ్యాల గాంధీభవన్​లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు 

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ హైదరాబాద్​కు వచ్చారు. గురువారం శంషాబాద్ ఎయిర్​పోర్టులో ఆమెకు ఏఐసీసీ కార్యరద్శి నదీమ్​జావెద్, ప్రొటోకాల్ కమిటీ చైర్మన్​ హర్కర వేణుగోపాల్ తదితరులు స్వాగతం పలికారు. శుక్రవారం గాంధీ భవన్​లో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో మీరాకుమార్ పాల్గొంటారు. ఉదయం 10.30కు జాతీయ జెండా ఎగురవేసి వేడుకలు ప్రారంభిస్తారు. 11 గంటలకు గన్​పార్క్​ వద్ద అమరవీరులకు నివాళులర్పించి, అక్కడి నుంచి నిజాం కాలేజీ దగ్గర్లోని బాబు జగ్జీవన్​రామ్ ​విగ్రహానికి నివాళి అర్పిస్తారు. తర్వాత గాంధీభవన్​కు పాదయాత్రగా వెళ్లి బహిరంగ సభలో మాట్లాడతారు. వేడుకల్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ మాణిక్​రావ్​ ఠాక్రే తదితరులు పాల్గొంటారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.

అమెరికాకు రేవంత్..  

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు రేవంత్‌రెడ్డి అమెరికా వెళ్లారు. అక్కడి జాన్​కెన్నడీ విమానాశ్రయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. యువత, విద్యార్థుల త్యాగాల ఫలితం, సోనియాగాంధీ వల్లనే తెలంగాణ సాధ్యమైందన్నారు.