
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ మెటా మరోసారి లేఆఫ్స్ ప్రకటించింది. AI సూపర్ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి ఉద్యోగులను తొలగిస్తుంది. మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తన AI సూపర్ ఇంటెలిజెన్స్ప్రాజెక్టుకోసం బెస్ట్ టీం ను ఏర్పాటు చేసుకున్న కొన్ని నెలలకే అదే టీం సభ్యులను తొలగించేందుకు సిద్దమయింది. మెటా AI డివిజన్ నుంచి దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఇంటర్నల్ మెమోలు పంపించినట్లు తెలుస్తోంది.
మార్క్ జుకెర్ బర్గ్ తన మెటాAI సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ కోసం గత కొన్నినెలల క్రితం బిలియన్ డాలర్లు ఖర్చు చేసి స్కిల్డ్ టీం ను రిక్రూట్ చేసుకున్నారు. దీంతో ఆపిల్, ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక వంటి రైవల్ కంపెనీలకు ధీటుగా స్కిల్డ్ఎంప్లాయీస్ ను సంపాదించుకున్నారు. అయితే ఇది జరిగిన కొన్ని నెలలకే AI సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ దాదాపు 600 మంది ఉద్యోగులను తగ్గించుకునేందుకు సిద్దమైంది.
ఉద్యోగుల కోతలపై స్పందించిన మెటా చీప్ AI ఆఫీసర్ అలెగ్జాండర్ వాంగ్.. కంపెనీ సామర్థ్యాన్ని పెంచడం, బ్యూరోక్రసీని తగ్గించడం లక్ష్యంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు మెటా కొత్తగా ఏర్పడిన TBD ల్యాబ్ లో అత్యధిక జీతాలతో కీలకమైన AI పొజిషన్లలో ఉద్యోగ నియామకాలు చేయనున్నట్లు తెలిపారు. మెటాలోని ఇతర విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు అప్లయ్ చేసుకోవాలని కంపెనీ ప్రకటించింది.
మెటా AI ఆశయాలకు అనుగుణంగా మార్క్ జుకెర్ బర్గ్ భారీగా పెట్టబడులు పెట్టారు. తన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఏర్పాటుకు వాంగ్ నేతృత్వంలోని డేటా లేబులింగ్ స్టార్టప్ అయిన స్కేల్ AIలో రూ.1.2 లక్షల కోట్లు ($14.3 బిలియన్లు) పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. రైవల్స్నుంచి AI స్కిల్డ్ ఉద్యోగులను ఆకర్షించేందుకు మెటా రూ.800 కోట్ల ($100 మిలియన్లు) వరకు ప్యాకేజీలను అందించిందని కూడా నివేదికలుచెబుతున్నాయి. ప్రస్తుతం లేఆఫ్స్ కంపెనీ పునర్నిర్మాణ చర్యే కానీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై వెనక్కి తగ్గడం కాదు అని మెటా ప్రకటించింది.