
గచ్చిబౌలి, వెలుగు: కస్టమర్ల ఇండ్లలో ఫిట్ చేయాల్సిన 42 విద్యుత్ మీటర్లను ఓ కాంట్రాక్టర్ అక్రమంగా తన ఇంట్లో నిల్వ చేశాడు. హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు మీటర్లను స్వాధీనం చేసుకుని, కాంట్రాక్టర్పై కేసు నమోదు చేశారు. ఇబ్రహీంబాగ్ డివిజన్ కు చెందిన కొందరు తమ ఇండ్లకు విద్యుత్మీటర్లకు అప్లయ్ చేసుకున్నారు. రోజులు గడుస్తున్నా మీటర్లు రాకపోవడంతో ఇబ్రహీంబాగ్ ఏడీఈ దృష్టికి తీసుకువెళ్లారు.
విచారణ చేపట్టగా ఇబ్రహీంబాగ్ డివిజన్లో దాదాపు 42 మీటర్లను కాంట్రాక్టర్ చెన్నకేశవరెడ్డి తీసుకున్నట్లు తేలింది. దీంతో ఇబ్రహీంబాగ్ఏడీ అంబేద్కర్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెలికాంనగర్లోని చెన్నకేశవరెడ్డి ఇంట్లో పోలీసులు తనిఖీ చేయగా మీటర్లు కనిపించలేదు. సీసీ ఫుటేజీలు చెక్చేయగా, ఓ ఆటోలో మీటర్లను తరలించి చిత్రపురికాలనీలోని ఓ ఇంట్లో మీటర్లు స్టోర్ చేసినట్లు గుర్తించారు. 42 మీటర్లును స్వాధీనం చేసుకున్నారు.
కాంట్రాక్టర్ చెన్నకేశవరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం ఇన్స్పెక్టర్ తెలిపారు. మీటర్లను వినియోగదారులకు సప్లై చేయకుండా పెద్ద మొత్తంలో నిల్వ చేయడంపై ఆరా తీస్తున్నారు.