హైదరాబాద్సిటీ,వెలుగు: గత వేసవిలో గ్రేటర్ పరిధిలో నీటి సమస్యల పరిష్కారంలో ట్యాంకర్ల సేవలను మెట్రోవాటర్బోర్డు ఎండీ అశోక్రెడ్డి అభినందించారు. సోమవారం వాటర్ట్యాంకర్ల ఆపరేటర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. వేసవిలో మెట్రోకస్టమర్ సర్వీస్(ఎంసీసీ) ఫిర్యాదుల పరిష్కారంతో పాటు ఉచిత ట్యాంకర్ల సరఫరాలోనూ ట్యాంకర్ల నిర్వాహకులు బాగా పని చేశారన్నారు. బల్దియాతోపాటు ఓఆర్ఆర్పరిధిలో నిరంతర నీటి సరఫరాను అందించడంలో ఆపరేటర్లు పనితీరు బాగుందన్నారు.
మిగితా రోజుల్లో ఆపరేటర్లకు కనీస వ్యాపార మద్దతు లభించడం లేదని వారు ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైన మేరకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా ఎండీ హామీ ఇచ్చారు. బోర్డు ఈడీ మయాంక్మిట్టల్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ వాటర్ట్యాంకర్ఓనర్స్అసోసియేషన్ అధ్యక్షుడు అక్బర్హుస్సేన్తో పాటు ట్యాంకర్ల ఆపరేటర్లు పాల్గొన్నారు.
