హై-స్పీడ్ ఇన్-కార్ కనెక్టివిటీ కోసమే
హైదరాబాద్, వెలుగు: తమ వెహికల్లో కనెక్టెడ్ కార్ సాఫ్ట్వేర్కు హైస్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు ఎంజీ మోటార్ ఇండియా.. జియోతో చేతులు కలిపింది. ఇండియా మార్కెట్లో త్వరలో లాంచ్ చేయబోయే మిడ్-సైజ్ ఎస్యూవీలో జియో ఐఓటి సొల్యూషన్స్ వాడుతామని తెలిపింది. ఎంజీ డ్రైవర్లు సిటీలతోపాటు చిన్న టౌన్లలో, పల్లెటూళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా జియో నెట్వర్క్ను ఉపయోగించవచ్చు. దీనివల్ల డ్రైవింగ్ ఎక్స్పీరియెన్స్ బాగుంటుందని, సేఫ్టీ పెరుగుతుందని ఎంజీ ప్రకటించింది. ఎంజీ కస్టమర్లకు ఈ–సిమ్ ఐఓటీ, స్ట్రీమింగ్ సొల్యూషన్స్ వంటివి అందజేస్తామని జియో ప్రకటించింది. దీనివల్ల రియల్టైం కనెక్టివిటీతోపాటు ఇన్ఫోటైన్మెంట్, టెలిమాటిక్స్ అందుబాటులోకివస్తాయని తెలిపింది.