హైదరాబాద్: బీఆర్ ఎస్ నేత హరీష్ రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. హరీష్ రావు నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు.. మైక్రోబేవరీలో అవకతవకలు జరిగాయంటూ.. మేమేదో డబ్బులు దండుకున్నట్లు హరీష్ రావు ప్రచారం చేస్తున్నారు.. మైక్రోబేవరేజెస్ కు జీవో ఇచ్చింది..అనుమతి ఇచ్చింది బీఆర్ ప్రభుత్వమే.. ఏమీ తెలియనట్లు హరీష్ రావు డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మైక్రోబేవరేజెస్ కు 110 దరఖాస్తులు రాగా.. వాటిలో బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలోనే 25 దరఖాస్తులకు అనుమతిచ్చారు. సింగూరు జలాలను మైక్రోబేవరీకి కేటాయించిందే గతప్రభుత్వం..కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే విమర్శలు చేస్తున్నారని అన్నారు. నలుగురు మంత్రులు ఒకే కారులో రాజ్ భవన్ కు వస్తే దానిపై కూడా ఆరోపణలు చేస్తున్నారు.
►ALSO READ | ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది: మీనాక్షి నటరాజన్
తెలంగాణకోసం మంత్రి పదవికిరాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నాను.. రాష్ట్రం వచ్చినంక బీఆర్ ఎస్ నేతలు, హరీష్ రావు వ్యవహారం, నిర్వాకం నచ్చకనే పార్టీని నుంచి బయటికి వచ్చానని మంత్రి జూపల్లి అన్నారు. 25ఏళ్లుగా నిజాయితీగా పనిచేస్తున్నాను.. మా ఊర్లో సొంత ఇళ్లు కూడా లేదు. నేను మాట్లాడిన మాటల్లో ఏ ఒక్కటి అబద్దం అని నిరూపించినా నేను దేనికైనా సిద్దమని హరీష్ రావుకు మంత్రి జూపల్లి సవాల్ విసిరారు.
అంతకుముందు మైక్రో బేవరేజెస్ పై మాట్లాడిన హరీష్ రావురాష్ట్రంలో మరో అవినీతి కుంభకోణాన్ని బయటపెడుతున్నట్లు చెప్పారు. ఎక్సైజ్ శాఖలో మైక్రో బేవరేజెస కు అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు. 110 దరఖాస్తుల్లో 25 కు అనుమతివ్వాలని నిర్ణయించారు.. కొత్త అనుమతుల్లో ముఖ్య నేత కోటా 21, మంత్రి కోటా 4 అని హరీష్ రావు ఆరోపించారు.
