హైదరాబాద్కు చెందిన 21ఏళ్ల ‘V- -బయోనిక్’ సీఈవో జైన్ అహ్మద్ సందాని.. మైక్రోసాఫ్ట్ 2022 ఇమాజిన్ కప్ వరల్డ్ చాంపియన్ షిప్ను గెలుచుకున్నారు. నరాల సమస్యలతో బాధపడేవారి కోసం ‘ఎక్సోహీల్’ అనే పరికరాన్ని తయారుచేసినందుకు గానూ.. జైన్, అతని బృంద సభ్యులకు ఈ ఘనత దక్కింది. న్యూరోప్లాస్టిసిటీ, అజూర్ టెక్నాలజీ సాయంతో పనిచేసే ఈ గ్లవుజులు.. నాడులు దెబ్బతినడంతో చేతులను కూడా కదపలేని వారికి ఉపయోగపడతాయని, వీటి సహకారంలో త్వరగా కోలుకుంటారని వారు తెలిపారు. ఇంకో ముఖ్య విషయమేమిటంటే ఈ చికిత్సకు అయ్యే ఖర్చుతో పోలిస్తే ‘ఎక్సోహీల్’ పరికరం ధర చాలా తక్కువ. మార్చి 31న నిర్వహించిన తొలి దశ పోటీలో ప్రపంచస్థాయిలో 16 టీములతో పోటీపడి అర్హత సాధించిన ‘వి-బయోనిక్’ సంస్థ.. అనంతరం అమెరికాలోని సియాటెల్లో నిర్వహించిన పోటీల్లో అమెరికా, ఆసియా దేశాలకు చెందిన జట్లతో ప్రశ్నోత్తరాల పోటీలో విజయం సాధించింది.
ఈ చాంపియన్ షిప్ పాటు 50 వేల డాలర్ల అజూర్ క్రెడిట్స్తోపాటు, లక్ష డాలర్ల నగదు బహుమతిని కూడా గెలుచుకున్నారు. వీటన్నటితోపాటు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో ఒక మెంటారింగ్ సెషన్నుస సైతం ఈ బృందం గెలుచుకుంది. ఇక జైన్ పుట్టింది హైదరాబాద్లోనే అయినా పెరిగిందంతా సౌదీ అరేబియాలోనే. ప్రస్తుతం జర్మనీలోని జాకబ్స్ యూనివర్సిటీలో రోబోటిక్స్ అండ్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ చదువుతున్న జైన్... 21 ఏళ్ల వయసులోనే రోబోటిక్స్పై పరిశోధనపై పట్టు సాధించి అరుదైన రికార్డును నెలకొల్పాడు.
మరిన్ని వార్తల కోసం...