ఇంటర్​ స్టూడెంట్స్​ కు మిడ్​ డే మీల్స్ : అనిరుధ్​ రెడ్డి

ఇంటర్​ స్టూడెంట్స్​ కు మిడ్​ డే మీల్స్ : అనిరుధ్​ రెడ్డి
  •     ఖర్చు తానే భరిస్తానని ప్రకటించిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్​ రెడ్డి

జడ్చర్ల టౌన్, వెలుగు: వివిధ కారణాలతో కాలేజీకి వచ్చే ఇంటర్​ స్టూడెంట్స్​ మధ్యాహ్న భోజనం తెచ్చుకోలేక ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే అనిరుధ్​ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల ఆకలి తీర్చేందుకు ఈ నెల 3 నుంచి నియోజక వర్గంలోని జడ్చర్ల బాలికల, బాలుర కాలేజీలతో పాటు బాలానగర్,​ యన్మనగండ్ల, మిడ్జిల్  జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్​ స్టూడెంట్స్​కు తన సొంత ఖర్చులతో మిడ్​ డే మీల్స్​ అమలు చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ ఐదు కాలేజీల్లో చదువుతున్న 1,300 మంది విద్యార్థుల ఆకలి తీర్చాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ మేరకు అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇదిలాఉంటే తన జన్మదినం సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి హైదరాబాద్​లో సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీటి సీఎం మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇదిలాఉంటే ఎమ్మెల్యే తన పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గంలోని 1,300 మంది ఇంటర్​ స్టూడెంట్స్​కు మిడ్​ డే మీల్స్​ పెడతానని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.