అప్పన్నపేట వద్ద బైక్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి

అప్పన్నపేట వద్ద బైక్‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి
  • పెద్దపల్లి సమీపంలోని అప్పన్నపేట వద్ద ప్రమాదం

పెద్దపల్లి/గోదావరిఖని, వెలుగు : బైక్‌‌‌‌ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు చనిపోయారు. ఈ ప్రమాదం పెద్దపల్లి సమీపంలోని అప్పన్నపేట వద్ద గురువారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గోదావరిఖని ఎన్టీఆర్‌‌‌‌ నగర్‌‌‌‌కు చెందిన చిలుకల చక్రి (25) సింగరేణి బి గెస్ట్‌‌‌‌హౌస్‌‌‌‌లో కాంట్రాక్ట్‌‌‌‌ వర్కర్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. తిలక్‌‌‌‌నగర్‌‌‌‌కు చెందిన సోగాల శ్యామ్‌‌‌‌ (23) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు.  

అనారోగ్యంతో ఉన్న తమ ఫ్రెండ్‌‌‌‌ను పరామర్శించేందుకు చక్రి, శ్యామ్‌‌‌‌ కలిసి బైక్‌‌‌‌పై గురువారం పెద్దపల్లికి వెళ్లారు. అర్ధరాత్రి తిరిగి వస్తుండగా అప్పన్నపేట ఫ్లైఓవర్‌‌‌‌ దాటిన తర్వాత పెట్రోల్‌‌‌‌ బంక్‌‌‌‌ నుంచి ఓ లారీ వచ్చి బైక్‌‌‌‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో చక్రి, శ్యామ్‌‌‌‌ అక్కడికక్కడే చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. చక్రికి భార్య అహల్య, ఏడాది వయస్సున్న కుమారుడు ఇషాన్‌‌‌‌ ఉన్నారు.