పద్మారావునగర్, వెలుగు : మాతా, శిశు ఆరోగ్య సంరక్షణకు మిడ్ వైఫరీ వ్యవస్థ ఎంతో గొప్పగా పని చేస్తుందని, రాష్ట్రంలో మరిన్ని మిడ్ వైఫరీ ట్రైనింగ్ఇనిస్టిట్యూట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. న్యూ బోయిగూడలో ఏర్పాటు చేసిన నేషనల్ మిడ్ వైఫరీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశంలోని మిడ్ వైఫరీ ఇనిస్టిట్యూట్లలో ఇది ఐదోది అని, రాష్ట్రంలో మొదటిదని తెలిపారు. బోయిగూడలోని పాత గాంధీ మెడికల్కాలేజీ బాలికల హాస్టల్భవనంలో హెల్త్, ఫ్యామిలీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూ 1.50 కోట్లతో మరమ్మతులు, శిక్షణా కేంద్రానికి అవసరమైన సౌకర్యాలను కల్పించారు.
మాత, శిశు మరణాల సంఖ్య తగ్గించడానికి, గర్భిణులకు ప్రసవ సమయంలో సీ సెక్షన్ ఆపరేషన్లను తగ్గించి, నార్మల్డెలివరీలను ప్రోత్సహించేందుకు మిడ్ వైఫరీ వ్యవస్థ ఎంతో గొప్పగా పనిచేస్తుందని పేర్కొన్నారు. బీఎస్సీ నర్సింగ్తర్వాత రెండేండ్ల పీజీ కోర్సు మిడ్ వైఫరీ శిక్షణను కంప్లీట్ చేసిన 350 మందికి సర్టిఫికెట్లను అందించి మంత్రి అభినందించారు. బల్దియా డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, కార్పొరేటర్ హేమలత, హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, డీఎంఈ డా.ఎన్.వాణి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా.అజయ్కుమార్ పాల్గొన్నారు.
